ఆధ్యాత్మికం

దక్షిణభారత అమర్‌నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం ఎక్క‌డ ఉందో తెలుసా..? దాని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి, ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను, సాహసీకులను మైమరపించే క్షేత్రం సలేశ్వరం.

నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. ఆ వెంటనే లోయలు.. పక్షుల కిలకిలరా-వాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. ప్ర‌తి ఏటా మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో ఇక్క‌డ ఉత్స‌వాలు జ‌రుగుతుంటాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి. దాదాపు 35 కి.మీ. పొడవునా దట్టమైన అడవిలో సాగే యాత్రలో 3 కి.మీ. కాలినడకనే కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. దక్షిణభారత అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం సాహసయాత్ర విశేషాలు ఇవే.

saleshwaram and its importance how to go

నిజానికి ఈ క్షేత్రం ఎప్పటితో ఎవ్వరికి తెలియదు. పురాణ కాలం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. తపస్సు చేసుకునేవారికి ఇది అనువైన స్థలమని పలువురు పండితులు పేర్కొంటున్నారు. ఈ చుట్టు పక్కల అడువుల్లో, గుహల్లో ఎందరో తపం ఆచరిస్తుంటారని ప్రతీక. అయితే ఇక్కడి ఆదివాసీల కథనం ప్రకారం ఐదారు శతాబ్దాల క్రితం ఈ క్షేత్రాన్ని తమ పూర్వీకులు కనుగొన్నారని వారు చెపుతున్నారు. అపటినుంచి లింగమయ్య ఆలయంలో ఆదివాసీలే పూజారులు. సలేశ్వరంలో వెలసిన లింగమయ్య (లింగం)ను భక్తులు తాకినప్పుడు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అందువల్లే కదిలే లింగమయ్యగా ఆదివాసీ పెద్దలు చెబుతుంటారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమిన‌ ఆదివాసీలు ప్రత్యేక దినంగా భావిస్తుంటారు. పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆలయం ఎదుట ఉన్న గుండంలో చంద్రకాంతి పడటం వలన ఆ కాంతిలో పుణ్యస్నానాలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.

280 అడుగులపైనుండి జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అక్కడ‌నే మరో గుహలో శనేశ్వరుని ఆలయం చాళక్యులు, చోళులు, పాండ్యులు, జైన, బుద్ధ, వైష్ణవుల కాలంలో చెక్కిన రాతి విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వరం వద్ద జాలువారే జలపాతం రెండు కొండల మధ్య సహజసిద్ధంగా లింగాకారంలో గుండంగా ఏర్పడింది. దీని లోతు సుమారు వంద అడుగులు ఉన్నట్లు ఆదివాసీలు చెబుతారు. జలపాతం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా తరలివస్తుంటారు. నల్లమల అటవీ మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 280 అడుగుల పైనుంచి జాలువారే జలపాతం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అయితే జలపాతం ఎక్కడనుండి పారుతుందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇక్కడ అన్ని కాలాల్లోనూ నీరు పైనుంచి జాలువారుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండు వేసవిలో నెమ్మదిగా జాలువారే జలపాతం.. భక్తులు పెరుగుతున్న కొద్దీ జలపాతం మరింతగా పెరుగుతుందని ఇక్కడి ఆదివాసీల నమ్మకం.

Admin

Recent Posts