భగవద్గీత హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. అంతే కాదు, ఇది ప్రపంచంలోని గొప్ప గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో వ్రాసిన జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలోని ప్రతి మలుపులో మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత చదివితే..మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది.. ఆలోచనా విధానం మారుతుంది. దేనిపై మోహం పెంచుకోవాలో దేన్ని త్యజించాలో తెలుస్తుంది. భగవద్గీతను దగ్గర ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. మనలో కొందరు భగవద్గీతను పర్సులో ఉంచుకుంటే, మరికొందరు బ్యాగ్లో, అల్మారాలో ఉంచుకుంటారు. అదే సమయంలో కొందరు భగవద్గీతను దిండు కింద పెట్టుకుంటారు. భగవద్గీతను దిండు కింద పెట్టుకోవాలా వద్దా అని తెలుసుకుందాం.
భగవద్గీతను దిండు కింద ఉంచడం మంచిదని భావిస్తారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొన్ని నియమాలు పాటించాలి. దిండు కింద భగవద్గీతను ఉంచడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది, ప్రతికూల శక్తులు మీకు రావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలో అంతరాయం ఉండదు. భగవద్గీతను దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల పీడకలలు రావు.
మీరు భగవద్గీతను దిండు కింద ఉంచినట్లయితే, పసుపు పట్టు వస్త్రాలలో ఉంచండి. రెండవ నియమం ఏమిటంటే భగవద్గీతను నిద్రపోయేటప్పుడు దిండు కింద మాత్రమే ఉంచుకోవాలి. మీరు పగటిపూట మంచం మీద కూర్చున్నట్లయితే, భగవద్గీతను దేవుని గదిలో లేదా స్వచ్ఛమైన ప్రదేశంలో ఉంచండి. ఎవరైనా భగవద్గీతను దిండు కింద ఉంచాలనుకుంటే, ఆహారం, పానీయాలతో ఆ స్థలం చుట్టూ కూర్చోవద్దు. అలా చేయడం వల్ల ఆ పవిత్ర గ్రంథం కూడా అపవిత్రం అవుతుంది.దీని వల్ల మీకు లభించే మంచి ఫలితాలు అశుభ రూపం దాల్చి మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. భగవద్గీత దేవుడితో సమానం.. దీన్ని చదవడం వల్ల మనిషిలో చాలా మార్పులు వస్తాయి.. మనం ఇన్ని రోజులు అనవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తూ..బంధాలకు బానిస అవుతున్నాం. మనిషికి చావు ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు అనే సత్యం అందరూ తెలుసుకుంటారు.