ఈ ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తే చాలు.. అనుకున్నవి నెరవేరుతాయి..!
కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న క్షేత్రం. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని, … Read more









