Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

భారత్ లో సొంత రైలును కలిగి ఉన్న ఒకే ఒక్క వ్యక్తి.. ఎవరో తెలుసా?

Admin by Admin
February 26, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత్ లో చాలా మంది దగ్గర విలువైన కార్లు, హెలికాఫ్టర్లు, విమానాలు, షిప్ లు ఉన్నాయి. కానీ, సొంత రైలు అనేది ఎవరీ దగ్గరా ఉండదు. కానీ, ఓ రైతు రైలుకు యజమాని అయ్యాడు. దేశంలో రైళ్లను భారతీయ రైల్వే సంస్థ నడిపిస్తుంది కదా? రైతు రైలును ఎలా కొనుగోలు చేశాడు? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా, ఇది నూటికి నూరు శాతం నిజం. రైల్వే అధికారులు చేసిన ఓవరాక్షన్ కారణంగా ఓ రైతు స్వర్ణ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇదో అరుదైన ఘటనగా మిగిలిపోయింది.

పంజాబ్ లోని లూథియానాకు చెందిన ఓరైతు రైలుకు ఓనర్ అయ్యాడు. 2007వ సంవత్సరంలో లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ చేపట్టారు. కటానా అనే గ్రామంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరికొద్ది నెలల్లోనే పక్క గ్రామంలో ఎకరానికి ఏకంగా రూ. 71 లక్షలు నష్టపరిహారం అందించారు. ఈ విషయం కటానా గ్రామంలోని సంపూరణ్ సింగ్ కు తెలిసింది. తను కూడా రైల్వే లైన్ కోస భూమిని ఇచ్చాడు. వెంటనే తను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు రూ. 25 లక్షలు పరిహారం ఇచ్చి, పక్క గ్రామంలో రూ. 71 లక్షలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. తమకు కూడా అదే మాదిరిగా నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.

do you know this person is owner to a train

సంపూరణ్ సింగ్ న్యాయస్థానంలో పోరాటం ముమ్మరం చేశారు. రైల్వే శాఖ అతడితో చర్చలు జరిపింది. ఎకరాకు రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పింది. అయినా ఆయన ససేమిరా అన్నారు. సంపూరణ్ సింగ్ కు ఇవ్వాల్సిన పరిహారం రూ. కోటిన్నరకు పెరిగింది. ఈ మొత్తాన్ని నార్తన్‌ రైల్వే 2015 లోగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఆయనకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం అందించలేదు. 2017 వరకు కేవలం రూ. 42 లక్షలు మాత్రమే చెల్లించింది.

2017లో సంపూరణ్ సింగ్ మరోసారి న్యాస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తనకు రావాల్సిన నష్ట పరిహారం అందించలేదన్నారు. దీనిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. అనంతరం డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి జస్పాల్‌ వర్మ సంచలన తీర్పు ఇచ్చారు. ఢిల్లీ-అమృత్‌ సర్‌ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ రైలుతో పాటు లూథియానాలోని స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాన్ని జప్తు చేయాలని జడ్జి ఆదేశించారు. పరిహారం కింద వాటిని సంపూరణ్ సింగ్ కు అందివ్వాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో సంపూరణ్ సింగ్ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్‌ కు ఓనర్ అయ్యారు. అంతేకాదు, దేశంలో సొంత రైలు ఉన్న ఏకైక వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత రైల్వేశాఖ పరిహరాన్ని అందించేందుకు ఒప్పుకోవడంతో న్యాయస్థానం తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ రైలుకు యజమాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Tags: persontrain
Previous Post

చల్లగా చిల్ అవుదామని కూల్ డ్రింక్స్‌ తాగారో ఇక అంతే సంగతులు.. విషంతో సమానమట..

Next Post

పాకిస్తాన్ భారతదేశంపై ముందస్తు హెచ్చరిక లేకుండా అణు ఆయుధాలతో దాడిచేస్తే ఏమవుతుంది?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.