పిల్లలు చదువుల్లో వెనుకబడుతున్నారా? చదివింది గుర్తుండటం లేదా? పెద్దలు జ్ఞాపక శక్తి కోల్పోతున్నారా? వీటికి పరిష్కారంగా కనీసం ఒక గ్లాసు పాలు ప్రతిరోజూ తాగండంటునన్నారు పరిశోధకులు. పాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించటమే కాదు. మన మెదడు కణాలను పాజిటివ్ గా ప్రభావిస్తుందంటున్నారు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వారిలో మెమొరీ పవర్ బాగా పెరిగిందని, పాలు తాగని వారి కంటే కూడా తాగిన వారు తాము చేసిన పరీక్షలలో నూటికి నూరు శాతం నెగ్గారని పరిశోధన చెపుతోంది.
మైనే యూనివర్శిటీ పరిశోధకులు తమ పరిశోధనను సుమారు 900 మందికి పైగా పురుషులు, స్త్రీలకు 23 సంవత్సరాలనుండి 98 సంవత్సరాల వయసు పాలు తాగే లేదా పాల ఉత్పత్తులు తినే వారికి మెదడు పరీక్షలు చేశారు. ఎనిమిది రకాలుగా వారి మానసిక పరిస్ధితిని పరిశీలించారు. రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగే వారిలో గణనీయమైన ప్రయోజనాలు కలిగాయని వెల్లడించారు.
ఎంత అధికంగా తాగితే అంత అధికమైన ప్రయోజనాలు కూడా వుంటాయట. పాలు ఎముకల బలానికే కాక గుండె ఆరోగ్యానికి, మానసిక వికాసానికి కూడా మేలు చేస్తాయని, పాలు తాగే వారిలో నరాల సంబంధిత మానసిక సమస్యలు సైతం వుండవని వెల్లడించినట్లు ఇంటర్నేషనల్ డైరీ జర్నల్ ప్రచురించింది. కనుక మీరు అమితంగా ప్రేమించే చిన్నారులకు చిన్న వయసునుండే కనీసం రోజూ ఒక గ్లాసు పాలు నేటినుండే తాగించండి.