పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ళ్ల‌ద్దాల అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు వ‌స్తున్నాయి. దీంతో త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే.. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు త‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే … Read more

పిల్లల కంటి చూపును పెంచే 10 అత్యుత్త‌మ‌మైన ఆహారాలు.. రోజూ ఇవ్వండి..!

క‌రోనా నేప‌థ్యంలో పిల్ల‌లు గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో వారు ఎక్కువ స‌మ‌యం పాటు ఫోన్లు, కంప్యూట‌ర్లు, టీవీలు, ట్యాబ్‌ల ఎదుట కాలం గ‌డుపుతున్నారు. ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. దీంతో పాటు గేమ్స్ ఆడ‌డం ఎక్కువైంది. అయితే ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల వారి క‌ళ్ల‌ను న‌ష్టం క‌లుగుతుంది. కంటి చూపు దెబ్బ తింటుంది. క‌ళ్లు పొడిగా మారి కంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక పిల్ల‌ల క‌ళ్ల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పై ఏర్ప‌డింది. … Read more

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ ల‌ను చూడ‌డం వ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. … Read more