కుంభ‌క‌ర్ణుడు 6 నెల‌ల పాటు నిద్ర‌పోతాడు క‌దా. అందుకు కార‌ణం ఏంటో తెలుసా..?

రామాయ‌ణంలో ఓ పాత్ర అయిన కుంభ‌క‌ర్ణుడి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడూ నిద్ర‌పోతూనే ఉంటాడ‌ని, మేల్కొంటే అత‌ని ఆక‌లిని ఆపడం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని కూడా తెలుసు. అయితే నిజానికి కుంభ‌క‌ర్ణుడికి అలా నిద్ర‌పోయే, అతిగా తినే అల‌వాటు ముందు నుంచీ లేదు. అత‌ను యుక్త వ‌య‌స్సు వ‌చ్చేట‌ప్ప‌టికీ అంద‌రిలాగే ఉండేవాడ‌ట‌. కానీ శాప‌వ‌శాత్తూ అలా అయిపోయాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు కుంభ‌క‌ర్ణుడు అలా నిద్ర‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..? అదే తెలుసుకుందా రండి..! రావ‌ణుడు, విభీష‌ణుడు, … Read more

మృత్యువునే ఎదిరించిన మార్కండేయ మ‌హ‌ర్షి గురించి మీకు తెలుసా..? శివున్ని కేవ‌లం స్మ‌రిస్తే చాలు, అలాంటి ఫ‌లితం ఉంటుంది..

మార్కండేయుడు మృకండ మహర్షి సంతానం. చిన్నతనంలోనే యముడిని ఎదిరించి, శివుని ఆశీస్సులతో చిరంజీవిగా నిలిచాడు. మృకండ మహర్షి, మరుద్వతి భార్యభర్తలు…. వీరికి సంతానం లోటు. పుత్రప్రాప్తి కోసం వారణాసి వెళ్లి రెండు శివలింగాలను ప్రతిష్టించి శివుడి కోసం త‌ప‌స్సు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, మంచి గుణాలతో 16 ఏళ్ళు జీవించే పుత్రుడు కావాలా? లేక చిరకాలం చిరంజీవిలా జీవించే దుర్గుణుడుని ప్రసాదించాలా అని అడుగుతాడు. మృకండ మహర్షి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణుడే … Read more

కీచ‌కున్ని భీముడు ఎలా చంపాడో తెలుసా..?

పాండవులు అజ్ఞాత వాసకాలంలో మత్స్యదేశంలో ఉన్నారు. విరాటుడు ఆ దేశం రాజు. ఆయన భార్య సుదేష్ణ. ఆమె తమ్ముడు సింహ బలుడు . కీచక దేశం వాడు గాబట్టి కీచకుడు అని వ్యవహారం. అతడు సేనాపతిగా రాజ్యరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యం కీచక బల సంరక్షితం అని ప్రసిద్ధి. అతడు మరణించిన తర్వాతే ఆ రాజ్యం బలహీనపడింది అని కౌరవులు ఆ రాజ్యం దక్షిణ ఉత్తర దిశలలో ఉన్న గోసంపదను అపహరిస్తారు. సైరంధ్రీ వృత్తిలో ఉన్న … Read more

భీష్ముడు ఎవ‌రి వ‌ద్ద విద్య‌ల‌ను నేర్చుకున్నాడు, ఆయ‌న గురువులు ఎవ‌రు..?

భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం. భీష్ముడు ఎవరు, ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసుకుందాం… భీష్ముడు గంగా, శంతనుల‌ అష్టమ పుత్రుడు. ఆయన దృఢవ్ర‌త‌ శీలుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు. భీష్ముడు … Read more

పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సుల‌భంగా చెప్పేసేవార‌ట‌..!

పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు. పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. … Read more

ర‌తిలో ఉన్న క్రౌంచ ప‌క్షుల జంట‌ను చూసిన వాల్మీకి.. ఏం చెప్పాడంటే..?

నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న స్నానానికి వెళ్తాడు. అ సమయంలో నది చుట్టూ ఉన్న వనంలోని అందాన్ని పరిశీలించడం ప్రారంభించాడు వాల్మీకి. అంతలో ఆయన కళ్లు ఒక చెట్టుపై నిలిచిపోయాయి. ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచపక్షు జంటమీద వాలాయి. జంటలోని పరస్పర ప్రేమానురాగాలని పరిశీలించసాగాయి మహర్షి నేత్రాలు. ఆ రెండు రతిపారవశ్యంలో ఉన్నాయి. … Read more

పాండవులు ల‌క్క ఇంటి నుంచి క్షేమంగా ఎలా త‌ప్పించుకున్నారో తెలుసా..?

కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల అనురాగాన్ని చూరగొంటాడు. దీంతో ధుర్యోధనుడికి, ధ్రుతరాష్ర్టుడికి అసూయ పెరుగుతుంది.దీంతో వారిరువురు కలిసి పాండవుల అంతానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. వారణావతం వెళ్లటానికి ధ్రుతరాష్ర్టుడు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. పాండవులను కొన్ని రోజులపాటు వారణావతంలో నూతనంగా నిర్మించిన లక్క ఇంట్లో ఉండమని పంపిస్తాడు. అక్కడ పాండవులను అంతమొందించాలని ధుర్యోధనుడు పురోచనుడనే … Read more

రామ‌య‌ణాన్ని వాల్మీకికి ఎవ‌రు చెప్పారో తెలుసా..?

రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడు తపస్సు,స్వాధ్యాయం చేసే నారద మహర్షికి వాల్మీకి నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్న అడిగాడు.. ఓ మహర్షి విష్ణులోకం నుంచి సర్వలోకాలు తిరిగే బ్రహ్మమానస పుత్రులు మీరు. సద్గుణాలు, పరాక్రమమూ, సత్యవ్రతం, సమర్థతా, ధైర్యం, సచ్ఛరిత్ర, పట్టుదల, అన్ని భూతాలందిష్టం, పాండిత్యం, కృతజ్ఞతాభావం, … Read more

మ‌హాభారతంలో మీకు ఏక‌ల‌వ్యుడి క‌థ గురించి తెలుసా..?

అరణ్యంలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు. అతడు తన గూడెంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తూ, వారిచే చక్కగా గౌరవించబడేవాడు. ఎరుకుల రాజుకు లేకలేక ఒక కొడుకు జన్మించాడు. ఆ చిరంజీవి పేరే ఏకలవ్యుడు. ఎరుకల జాతివారికి వేట పుట్టుకతో వచ్చే విద్య బాల్యం నుంచి ఏకలవ్యుడికి సాధు జంతువుల మీద చాలా దయ. సాధు జంతువులను చంపే క్రూరజంతువులను వేటాడాలనే మక్కువ ఎక్కువ. అయితే వయస్సుతోపాటు విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించాలనే కోరిక కూడా ఏకలవ్యునిలో పెరుగుతూ … Read more

న‌ర‌సింహ అవ‌తారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..? ఆయ‌న‌ను ఎలా పూజించాలంటే..?

నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు. ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కశ్య ప్రజాపతికి భార్య దితి. ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు. లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు. దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు. ఆయన తీవ్రమైన తపస్సు … Read more