శివుడికి ఏ ప‌దార్థంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివాభిషేకం అంటే చాలు అందరికి సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాదు అన్నింటికి సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయణిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయించుకోవాల్సింది శివాభిషేకమే. అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్ర వచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం… శివానుగ్ర‌హం పొందాలంటే శుభ్ర‌మైన జ‌లంతో అభిషేకించాలి. ఆవుపాల‌తో అభిషేకం చేస్తే స‌ర్వ సౌఖ్యాలు క‌లుగుతాయి. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకిస్తే ఆరోగ్యం, బ‌లం, య‌శ‌స్సు సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం … Read more

రోహిత్ శ‌ర్మ ఒక‌ప్పుడు అత్యంత పేద‌రికం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా..?

రోహిత్ శర్మ చాలా పేద కుటుంబానికి చెందినవాడు. అతని కుటుంబం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాకు చెందినది. అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక కంపెనీలో కేర్ టేకర్ గా పనిచేసేవాడు మరియు అతని ఆదాయం చాలా తక్కువగా ఉండటం వలన అతను రోహిత్ శర్మను కూడా పెంచలేకపోయాడు. అందుకే వారు రోహిత్‌ను ముంబైలోని అతని మామ, తాతయ్యల వద్దకు పంపారు. రోహిత్ త‌ల్లి తెలుగు వారు. రోహిత్ ముంబై చేరుకున్నప్పుడు అతనికి 12 సంవత్సరాలు. డోంబివ్లిలోని ఒక … Read more

ప్రపంచంలో అత్యంత అవినీతికరమైన ఆహారం ఏది?

నా దృష్టిలో ప్రపంచంలోనే అత్యంత అవినీతి కరమైన ఆహారం ఎయిర్పోర్ట్ లో అమ్మే బర్గర్, టీ మరియు కాఫీ . నేను పోయిన వారం ఢిల్లీ వెళ్ళినపుడు పక్కన ఉన్న వారి మాటలు విని , మొహమాటం కొద్దీ ఫస్ట్ టైం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న Subway స్టాల్ లో మొదటి సారి బర్గర్ తినవలసిన దుస్థితి వచ్చింది . ఇందులో నీకు రుచి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు కానీ అవినీతి ఆహరం అని … Read more

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

రోడ్డు మీద పండ్లు అమ్ముతున్న ఈవిడ పేరు చంద్రావతి సరు.. ఐతే ఏంటి? చాలా మంది రోడ్డు మీద పండ్లు అమ్ముతారు అందులో గొప్పేముంది అంటారా..? ఈవిడ..ఎవరో కాదు.. బీజేపీ తరఫున 8 సార్లు ఎంపీ గా గెలిచి..డిప్యూటీ స్పీకర్ గా…కేంద్ర మంత్రిగా పనిచేసిన కరియా ముండా గారి కూతురు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయిన చంద్రావతి సరు, జార్ఖండ్ రాజధాని రాంచీకి దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుంటి అనే పట్టణం వీధుల్లో మామిడి పండ్లను … Read more

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అసలు ఏమిటి?

సత్యం అంటే నిజం. పాలన, విధివిధానాల్లో నీతి, నిజాయితీకిగాను ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ బహుమతిని రెండు సార్లు గెలుచుకుంది సత్యం. 50,000 పైచిలుకు ఉద్యోగులతో 60 దేశాల్లో కార్యాలయాలతో మన దేశపు నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా విరాజిల్లింది సత్యం. E&Y Entrepreneur Of The Year, 2008 అవార్డుకు ఎంపికయ్యారు రామలింగరాజు. దాదాపు ప్రతీరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాదులో ఐటీ సంస్థల పెట్టుబడులకు అనుకూలంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చే ప్రణాళికపై నేరుగా అప్పటి … Read more

సంపూర్ణ ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి..!

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి. ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు… 1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన … Read more

శరీరానికి పండ్లు చేసే మేలు..!

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి. ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్ల‌ను నిత్యం సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు … Read more

పాలతో పండంటి ఆరోగ్యం..!

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారాల‌లో పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా … Read more

భీష్ముడు ఎవ‌రి వ‌ద్ద విద్య‌ల‌ను నేర్చుకున్నాడు, ఆయ‌న గురువులు ఎవ‌రు..?

భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు అంటుంటారు. అంటే ఆయా విద్యలు లేదా పనుల్లో మహా నిపుణుడు/పారంగతుడు అని అర్థం. భీష్ముడు ఎవరు, ఎక్కడ విద్యను అభ్యసించాడో తెలుసుకుందాం… భీష్ముడు గంగా, శంతనుల‌ అష్టమ పుత్రుడు. ఆయన దృఢవ్ర‌త‌ శీలుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయన సకల ధర్మాలను చ్యవన, మార్కండేయుల వద్ద నేర్చుకున్నాడు. భీష్ముడు … Read more

పూర్వం చెట్టును చూసే దాని ఆకులు ఎన్ని ఉన్నాయో సుల‌భంగా చెప్పేసేవార‌ట‌..!

పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు. పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. … Read more