మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: వృద్దులు, దీర్ఘ‌కాలిక అనారోగ్యాలు ఉన్న‌వారికి వ్యాక్సినేషన్‌..

మార్చి 1 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వ్యాక్సిన్ నేప‌థ్యంలో శుభ‌వార్త చెప్పింది. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల‌తోపాటు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్లడించారు. రెండు లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని తెలిపారు. 45 ఏళ్లకు పైబ‌డిన వ‌య‌స్సు ఉన్న‌వారికి కూడా వ్యాక్సిన్‌ను ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. … Read more

కోవిడ్ 19కు ఓజోన్ థెర‌పీ.. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందంటున్న నిపుణులు..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఎంతో మందిని బ‌లి తీసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 11,23,05,539 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. 24,86,641 మంది చ‌నిపోయారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ వ‌చ్చిన వారికి చికిత్స‌ను అందించేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు వైద్య నిపుణులు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక విధానాల‌ను, మెడిసిన్ల‌ను వారు కోవిడ్ చికిత్స‌కు ఉప‌యోగిస్తున్నారు. అయితే తాజాగా ఓజోన్ థెర‌పీ కూడా కోవిడ్ … Read more

దేశంలో ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతున్న ఎన్‌440కే క‌రోనా వైర‌స్‌.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీసీఎంబీ వార్నింగ్‌..

క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, నిత్యం న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య భారీగా ప‌డిపోవ‌డంతో.. క‌రోనా ఇక లేద‌ని, అంతం అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో గ‌త వారం, ప‌ది రోజుల నుంచి నిత్యం న‌మోదు అవుతున్న క‌రోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో క‌రోనా సెకండ్ వేవ్ వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. కాగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టికే … Read more

శుభ‌వార్త‌.. మార్చి నుంచి వృద్ధుల‌కు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కోవిడ్ వ్యాక్సినేష‌న్‌..!

జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి భార‌త్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ నుంచి ఇత‌ర ఫ్రంట్ లైన్ వారియర్ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా మార్చి నెల నుంచి 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ పార్ల‌మెంట్‌లో … Read more

గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా ?

క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌న‌వ‌రి 16వ తేదీన వ్యాక్సినేష‌న్ ప్రారంభం కాగా తొలుత ప్ర‌భుత్వ రంగానికి చెందిన ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ప్ర‌స్తుతం ప్రైవేటు రంగానికి చెందిన వైద్య సిబ్బందికి టీకాల‌ను వేస్తున్నారు. తొలి ద‌శ‌లో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మొత్తం క‌లిపి 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు టీకాల‌ను వేయ‌నున్నారు. అయితే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా ? అనే … Read more

ఢిల్లీలో ఈ చ‌లికాలంలో 50 శాతం పెరిగిన హార్ట్ ఎటాక్ కేసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గరంలో ప్ర‌స్తుతం గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అత్యంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్ర‌త‌లు తాజాగా 1.1 డిగ్రీల సెల్సియ‌స్‌కు ప‌డిపోయాయి. గ‌త 15 ఏళ్లుగా ఇది ఢిల్లీలో రెండో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త కావ‌డం విశేషం. 2006లో ఢిల్లీలో 0.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. అయితే ఇంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతుండ‌డం వల్ల ఢిల్లీలో ప్ర‌స్తుతం గుండె జ‌బ్బుల బాధితులు పెరిగారు. గ‌త ఏడాది క‌న్నా ఈ … Read more

దేశంలో ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తి

పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేసిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రాజెనెకాల‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నియ‌మించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం అనుమ‌తి ఇచ్చింది. సీర‌మ్ ఇనిస్టిట్యూట్ గ‌త కొద్ది రోజుల క్రితం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ అందించిన వివ‌రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తులు జారీ చేసింది. కాగా … Read more

కరోనా ఎఫెక్ట్‌.. కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు 70 శాతం పెరిగారు..

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గ‌త 8 నెల‌లుగా అనేక మంది ఇళ్ల నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం పేరిట చాలా మంది ఇళ్ల నుంచే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ర‌ప్పిస్తున్నాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు మాత్రం ఇంకా వ‌ర్క్ ఫ్రం హోం మోడ‌ల్‌లోనే ప‌ని చేస్తున్నారు. అయితే దీని వ‌ల్ల మ‌రో కొత్త స‌మ‌స్య వ‌చ్చింది. కీళ్లు, మోకాళ్లు, వెన్ను, మెడ నొప్పుల బాధితులు ఈ 8 … Read more

కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్లు ప‌నిచేస్తాయి: కేంద్రం

కొత్త కోవిడ్ స్ట్రెయిన్ దేశంలో క‌ల‌క‌లం రేపుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ విష‌యంపై ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల‌తోపాటు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లు అన్నీ కూడా కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన సైంటిఫిక్ అడ్వ‌యిజ‌ర్ ప్రొఫెస‌ర్ కె.కృష్ణ‌స్వామి విజ‌య్ రాఘ‌వ‌న్ మీడియాతో మాట్లాడారు. కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను యూకేతోపాటు ప‌లు దేశాల్లో గుర్తించార‌ని అన్నారు. అయితే ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా … Read more

జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు దేశంలో కోవిడ్ ఆంక్ష‌ల పొడిగింపు.. కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు..

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లే జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ యూకే ద్వారా కొత్త క‌రోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో కోవిడ్ ఆంక్ష‌ల అమ‌లును పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో జ‌న‌వ‌రి 31వ … Read more