అలసందలను తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అలసందలు కూడా ఒకటి. ఇవి గింజల రూపంలోనూ లభిస్తాయి. వీటిని నవధాన్యాల్లో ఒకటిగా చెబుతారు. వీటిల్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అలసందలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అలసందలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. 2. హైబీపీ ఉన్నవారు అలసందలను రోజూ ఆహారంలో భాగం … Read more

రోజూ గుప్పెడు వాల్ న‌ట్స్ ను తింటే.. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌నకు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ప‌దార్థాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిల్లో అనేక ర‌కాల పోషకాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని ర‌కాల పోష‌కాలు వాల్ న‌ట్స్ లో ఉంటాయి. రోజూ వాల్ న‌ట్స్‌ను తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వాల్ న‌ట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విట‌మిన్ ఇ, మెల‌టోనిన్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరంలోని … Read more

పిత్త దోషం అంటే ఏమిటి ? దీని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు, తీసుకోవాల్సిన ఆహారాలు..!

ఆయుర్వేద ప్ర‌కారం మ‌న శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫ అనే మూడు దోషాల్లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌తల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒక్కో దోషం హెచ్చు త‌గ్గులను బ‌ట్టి వ్యాధులు వ‌స్తుంటాయి. ఇక అగ్ని, జ‌లం క‌ల‌యికే పిత్తం. ఇది వేడి, నూనె, కాంతి అనే స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో పిత్తం ఎక్కువైతే పిత్త దోషం వ‌స్తుంది. పిత్త దోషం శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు, చెమ‌ట ప‌ట్టేందుకు, నిద్ర‌కు, ఆలోచించేందుకు, … Read more

హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ను త‌గ్గ‌కుండా చూసుకోండి.. ఈ ఆహారాలు ఉప‌యోగ‌ప‌డతాయి..!

మ‌న శ‌రీరంలో ర‌క్త క‌ణాల సంఖ్య త‌గినంత ఉండాలి. అప్పుడే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా ఎర్ర ర‌క్త కణాల సంఖ్య ఎక్కువ‌గా ఉండాలి. దీంతో శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంది. ఇది శ‌రీరం మొత్తానికి ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బ‌న్ డ‌యాక్సైడ్ ను బ‌య‌ట‌కు తీసుకెళ్తుంది. శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉంటే ప‌లు ర‌కాల క్రియ‌లు … Read more

విట‌మిన్ డి లోపం ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. రోజూ మ‌న‌కు ఎంత మోతాదులో అవ‌స‌ర‌మో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక ర‌కాల పోష‌కాల్లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది చాలా ముఖ్య‌మైన విట‌మిన్. అనేక ర‌కాల జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో విట‌మిన్ డి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. అయితే చాలా మందికి విట‌మిన్ డి లోపం వ‌స్తుంటుంది. ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిత్యం త‌గినంత స‌మ‌యం సూర్య‌ర‌శ్మిలో గ‌డ‌ప‌డం లేదు. దీంతో విటమిన్ డి లోపం … Read more

శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

శాండల్‌వుడ్‌.. చందనం.. గురించి అందరికీ తెలిసిందే. దీన్ని సబ్బులు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే శాండల్‌వుడ్‌ నూనె కూడా మనకు లభిస్తుంది. దీంతో అందం పరంగానే కాక ఆరోగ్య పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శాండల్‌వుడ్‌ ఆయిల్‌ అద్భుతమైన యాంటీ సెప్టిక్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు, కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు తగ్గిపోతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. సంబంధిత ప్రదేశంపై రోజూ ఈ నూనెను రాస్తుంటే … Read more

ఈ మొక్క ఆకు ర‌సాన్ని రోజూ తీసుకుంటే చాలు.. బీపీ త‌గ్గుతుంది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్ర‌జ‌లను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హైబీపీ ఒక‌టి. బీపీ నిరంత‌రం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల హైబీపీ వ‌స్తుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వంశపారంప‌ర్యంగా కొంద‌రికి బీపీ వ‌స్తుంది. అలాగే పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, అధిక బ‌రువు, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, అధికంగా ఉప్పు తీసుకోవ‌డం, ఒత్తిడి, వ‌య‌స్సు మీద ప‌డ‌డం, కిడ్నీ స‌మ‌స్య‌లు, నిద్ర‌లేమి వంటి అనేక కార‌ణాల వ‌ల్ల బీపీ వ‌స్తుంటుంది. 120/80 … Read more

తుల‌సి ఆకుల‌తో త‌యారు చేసే క‌షాయం.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది..!

ఓ వైపు క‌రోనా సమ‌యం.. మ‌రోవైపు సీజ‌న్ మారింది.. దీంతో మ‌న శ‌రీరంపై దాడి చేసేందుకు సూక్ష్మ క్రిములు సిద్ధ‌మ‌వుతున్నాయి. వాటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సీజ‌న్ మారిన‌ప్పుడు స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం వ‌స్తాయి. కానీ కోవిడ్ స‌మయం క‌నుక ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయాల‌ను తాగాలి. అలాంటి ఓ క‌షాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే క‌షాయం … Read more

ఉద‌యం, రాత్రి.. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఎప్పుడు తాగితే ఏవిధ‌మైన లాభాలు క‌లుగుతాయంటే..?

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం విదిత‌మే. ఈ విధంగా తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అయితే నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగితే ఒక విధంగా, రాత్రి తాగితే ఒక విధంగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగితే 1. నిమ్మ‌ర‌సం నీళ్ల‌ను ఉద‌యం తాగడం వ‌ల్ల డీహైడ్రేష‌న్ స‌మ‌స్య బారిన … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో జీర్ణ స‌మ‌స్య‌లు చాలా స‌హ‌జం అయ్యాయి. చాలా మందికి ఏదో ఒక జీర్ణ స‌మ‌స్య వ‌స్తోంది. కొంద‌రికి అజీర్ణం ఉంటుంది. కొంద‌రికి గ్యాస్, కొంద‌రికి మ‌ల‌బ‌ద్ద‌కం.. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో జీర్ణ స‌మ‌స్య ఉంటుంది. అయితే రోజూ ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే మంచి బాక్టీరియా ఉంటుంది. క‌నుక ఇంట్లో త‌యారు … Read more