బాదంప‌ప్పును రోజుకు రెండు సార్లు తింటే డ‌యాబెటిస్, కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

రోజుకు రెండు సార్లు బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల గ్లూకోజ్ మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంద‌ని, దీంతో డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఒక అధ్య‌య‌నం చేప‌ట్టారు. బాదంప‌ప్పుల‌ను తిన‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ మెరుగు ప‌డ్డాయ‌ని, ప్రీ డ‌యాబెటిస్ స్టేజిలో ఉన్న‌వారు బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ రాకుండా నివారించార‌ని తేలింది. బాదంప‌ప్పును రోజుకు రెండు సార్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) స్థాయిలు త‌గ్గాయ‌ని, … Read more

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలా ? అయితే వెజిటేరియ‌న్ డైట్ తినండని చెబుతున్న సైంటిస్టులు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా శాకాహారం తినేవారు, మాంసాహారం తినేవారు.. రెండు ర‌కాల ఆహార ప్రియులు ఉంటారు. కొంద‌రు త‌మ విశ్వాస‌ల వ‌ల్ల శాకాహారం తింటారు. కానీ కొంద‌రు మాంసాహారం విడిచి పెట్టి శాకాహారం మాత్ర‌మే తిన‌డం ప్రారంభిస్తుంటారు. అయితే మాన‌సిక ఆరోగ్యానికి శాకాహారం తినాల్సి ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆయుర్వేదం కూడా దీని గురించి చెబుతోంది. రోజూ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల పోష‌కాలు స‌రిగ్గా ల‌భిస్తాయి. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. … Read more

విట‌మిన్ డి త‌గ్గితే అధికంగా బ‌రువు పెరుగుతారు.. విట‌మిన్ డి ఎంత ఉండాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. వాటి ఆరోగ్యానికి విట‌మిన్ డి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. అందువ‌ల్ల విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటుండాలి. అయితే శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ డి లేక‌పోతే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హానిక‌ర ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి. విట‌మిన్ డి శ‌రీరంలో త‌గినంత లేక‌పోతే అధికంగా బ‌రువు కూడా పెరుగుతారు. క‌నుక విట‌మిన్ డిని … Read more

మీకు హైబీపీ ఉందా ? అది అదుపులో ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే కోవిడ్ ముప్పు ఎక్కువ‌వుతుంది..!

హైప‌ర్‌టెన్ష‌న్ లేదా హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. ఇదొక తీవ్ర‌మైన అనారోగ్య స్థితి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా అనేక మంది హైబీపీ కార‌ణంగా చ‌నిపోతున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లై దాదాపుగా ఏడాదిన్న‌ర దాటింది. ఈ క్ర‌మంలోనే హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు కోవిడ్ కార‌ణంగా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. మన దేశంలో దాదాపుగా 30 శాతం మంది హైప‌ర్ టెన్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య ఏటా గ‌ణ‌నీయంగా పెరిగిపోతోంది. … Read more

హైబీపీని త‌గ్గించే నంబ‌ర్ వ‌న్ ఫుడ్ ఇది.. త‌ర‌చూ తింటే మేలు జ‌రుగుతుంది..!

ఇండియ‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతున్న ప్ర‌కారం.. ప్ర‌తి ముగ్గురు భార‌తీయుల్లో ఒక‌రు హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే హైబీపీని త‌గ్గించేందుకు పుచ్చ‌కాయ బాగా ప‌నిచేస్తుంది. పుచ్చ‌కాయ‌లో ఉండే పోషకాలు బీపీని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల బీపీని త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారు పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం మంచిది. పుచ్చ‌కాయ‌ల్లో ఎల్‌-సిట్రులైన్, లైకోపీన్‌, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని అమాంతం త‌గ్గించేస్తాయి. అమెరిక‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ హైపర్‌టెన్ష‌న్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ప్ర‌కారం.. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో దీన్ని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు..!

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌డం నిజంగా క‌ష్ట‌మే. అందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. డైట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి. వేళ‌కు తిండి తినాలి, నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. ఇలా రోజూ చేస్తేనే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. అయితే రోజూ ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో పాల‌ను తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులు … Read more

తృణధాన్యాల‌ను రోజూ 100 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే గుండె జ‌బ్బుల ప్ర‌మాదం, న‌డుం చుట్టుకొల‌త‌ త‌గ్గుతాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు స‌ర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకుంటే మధ్య వయస్కుల‌లో నడుము చుట్టు కొల‌త‌, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయ‌ని తేల్చారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జీన్ మేయర్ యూఎస్‌డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్ర‌కారం.. పై వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు … Read more

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ ల‌ను చూడ‌డం వ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. … Read more

చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? చేప‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతాయా ?

మ‌న శ‌రీరం స‌రైన బరువును క‌లిగి ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌. బ‌రువు త‌గినంత‌గా లేకపోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా, మ‌రీ ఎక్కువ‌గా ఉన్నా న‌ష్టాలే క‌లుగుతాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారికి చేప‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. చేప‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు. 1. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గ‌డం … Read more

చెవుల‌పై వెంట్రుక‌లు ఎక్కువ‌గా పెరుగుతున్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండ‌డం, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్యల కార‌ణంగా చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటే ఆ ల‌క్ష‌ణాల‌ను ముందుగానే క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు చెవుల‌పై పెరిగే వెంట్రుక‌ల‌ను వారు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు. పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు … Read more