మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే.. కాక‌పోతే ఇలా చేయాలి..!!

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత నిద్రిస్తుంటారు. కొంద‌రు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొంద‌రు మ‌ధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర శ‌రీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? న‌ష్టం ఏమైనా ఉంటుందా ? అంటే… మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవ‌చ్చు. అది మంచిదే. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని … Read more

ఆలుచిప్స్‌, ఇత‌ర జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? కిడ్నీ వ్యాధులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

taking potato chips and other junk foods can create kidney problems

ఆలు చిప్స్‌, చాకొలేట్లు, ఇత‌ర ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్ర‌త్త. మీకు కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విష‌యాన్ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల ద్వారా తాజాగా వెల్ల‌డించారు. త‌ర‌చూ ఆయా ఆహారాల‌ను తినే వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, ముఖ్యంగా కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని తెలిపారు. చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, నూనె … Read more

ఉద‌యం 8.30 లోపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

type 2 diabetes risk will be reduced if breakfast is taken before 8.30 am

మ‌న‌లో కొంద‌రు రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రిస్తారు. దీంతో స‌హ‌జంగానే మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తారు. ఈ క్ర‌మంలో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను కూడా ఆల‌స్యంగానే పూర్తి చేస్తారు. అయితే ఇలా చేయ‌డం అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ ఉద‌యం 8.30 గంట‌ల లోపు పూర్తి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. మొత్తం 10,575 మందికి చెందిన వివ‌రాల‌ను … Read more

రోజూ చ్య‌వ‌న్‌ప్రాశ్ తింటే క‌రోనా దూరం.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!!

eating chyawanprash can prevent covid infection says scientists

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి చ్య‌వ‌న్‌ప్రాశ్‌ను తింటున్నారు. ముఖ్యంగా వృద్దులు దీన్ని ఎక్కువ‌గా తీసుకుంటారు. ఇందులో అనేక ఔష‌ధ విలువలు ఉండే మూలిక‌లు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని రోజూ తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే రోజూ చ్య‌వ‌న్‌ప్రాశ్‌ను తిన‌డం వ‌ల్ల క‌రోనా రాకుండా ఉంటుంది. ఈ విష‌యాన్ని ఢిల్లీలోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిట‌ల్ వారు రీసెర్చి చేసి వెల్ల‌డించారు. ఢిల్లీలోని చౌద‌రి బ్ర‌హ్మ ప్ర‌కాష్ ఆయుర్వేద చ‌ర‌క్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు గ‌తేడాది మే … Read more

నిత్యం కూర్చుని పనిచేసే వారిలో మూత్రపిండ సమస్యలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

మారుతున్న కాలానికి అనుగుణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నందున అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. గత 10-15 ఏళ్లుగా భారత్‌లో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొత్తం మందిలో జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి శాతం 60గా ఉందని గణాంకాల్లో వెల్లడైంది. ముఖ్యంగా యువత ఈ వ్యాధుల బారిన పడుతున్నారని … Read more

రోజూ ఒక క‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీతో హైబీపీ త‌గ్గుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..!

టీ ప్రేమికులు నిత్యం ర‌క ర‌కాల టీల‌ను తాగేందుకు చూస్తుంటారు. కొంద‌రు కేవ‌లం సాధార‌ణ టీ తోనే స‌రిపెట్టుకుంటారు. కానీ కొంద‌రు గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా వెరైటీ వెరైటీ టీ ల‌ను తాగుతుంటారు. అయితే నిత్యం ఒక‌ప్పు గ్రీన్ లేదా బ్లాక్ టీని తాగ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైంటిస్టులు కంప్యూట‌ర్ మోడ‌ల్ ఆధారంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో వెల్ల‌డైందేమిటంటే.. నిత్యం … Read more

వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక ల‌క్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల వ‌ల్ల చ‌నిపోతున్నారు. గుండెకు స‌ర‌ఫ‌రా అయ్యే ర‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి. ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం, ఛాతిలో … Read more

కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి ఎముకల సమస్యలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..

మీకు కిడ్నీ స్టోన్ల సమస్య ఉందా ? అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ఎముకలను కూడా చెక్‌ చేయించుకోండి. ఎందుకంటే.. కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారికి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో సైంటిస్టులు ఓ అధ్యయనానికి చెందిన వివరాలను ప్రచురించారు. 2007 నుంచి 2015 మధ్య 5,31,431 మంది కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్న వారిపై సైంటిస్టులు … Read more

రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

పండ్లు.. కూరగాయలు.. ఏ రకానికి చెందిన పండులో అయినా.. కూరగాయల్లో అయినా.. అనేక పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే అనేక రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం లేదా నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మూడ్ మారుతుంది. మెదుడు పనితీరు మంద‌గిస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌న్న‌గిల్లుతుంది. క‌నుక నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాల్సి ఉంటుంది. క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచంలో అధిక శాతం మంది తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌వుతూ నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌పంచంలో 63 దేశాల్లో 2,555 … Read more